భారత్లో కరోనా కేసుల సంఖ్య మళ్ళీ మెల్లగా పెరుగుతుంది. దేశ వ్యాప్తంగా కరోనాకు టీకా అందుబాటులోకి రావడంతో చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చేలా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,993 కరోనా కేసులు నమోదు కాగా, 101 మంది కరోనా బారిన పడి మరణించారు.
అయితే దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,09,77,387కి చేరింది. ప్రస్తుతం అందులో 1,43,127 యాక్టివ్ కేసులు ఉండగా, 1,06,78,048 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటివరకు మొత్తం 1,56,212 మంది కరోనా బారిన పడి చనిపోయారు. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో దేశంలో మొత్తం 13,993 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 97.3 శాతం ఉండగా, మరణాల రేటు 1.4 శాతంగా ఉన్నట్టు తెలుస్తుంది.