ఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమ క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఇటీవల కరోనా వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రావడంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో 18,257 శాంపిల్స్ని పరీక్షించగా కేవలం 41 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. అయితే కరోనా బారిన పడి నేడు ఎవరూ మృతి చెందలేదు. అయితే రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,89,339 కి చేరింది.
అయితే ఇందులో ప్రస్తుతం 590 మంది చికిత్స పొందుతుండగా 8,81,582 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని మరో 71 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,167 కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,37,46,985 శాంపిల్స్ పరీక్షించారు.